Thursday, March 28, 2024

హుజురాబాద్ లో ఈటెల గెలిచి ఏం చేస్తారు: గంగుల

హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. టిఆర్ఎస్, బిజెపి పార్టీలు పోటాపోటీగా నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నాయి. మాజీ మంత్రి ఈటల ను టార్గెట్ చేసిన టిఆర్ఎస్ అభివృద్ధి మంత్రంతో మళ్లీ గెలవాలని యోచిస్తోంది అందులో భాగంగా ఇప్పటికే కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం విడుదల చేసింది.హుజురాబాద్‌ ప్రచారంలో భాగంగా మంత్రి గంగుల కమలాకర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ది జరుగాలని ఎమ్మెల్యేలుగా ప్రజలు గెలిపిస్తారని…మరీ ఈటెల రాజేందర్ ను గెలిపిస్తే ఏం చేసారని ప్రశ్నించారు. ఈటెల ఈ ప్రాంతానికి చేసింది ఏం లేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ దగ్గర నుండి నిధులు తీసుకువచ్చి అభివృద్ది చేయాల్సి ఉండాల్సిందన్నారు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ తరహాలో హుజురాబాద్‌ను అభివృద్ది చేస్తామని..నిధులకు కొరత లేదని హామీ ఇచ్చారు. హుజురాబాద్‌ నియోజక వర్గంలో ఒక్క రోడ్డు లేదు. దుమ్ము, దూళీ తప్ప ఏం కనిపించడం లేదని మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement