Monday, April 15, 2024

Paddy: పంజాబ్‌లో కొన్నారు తెలంగాణలో ఎందుకు కొనరు?

రాజ్యాంగం ప్రకారం పంటలను కొనే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.  రైతులను కేంద్ర ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెడుతున్నదని మండిపడ్డారు. ధాన్యం  కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రిగా కిషన్‌ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చెప్పేదానికి పొంతన లేదని విమర్శించారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం తుగా నిరసనగా కరీంనగర్‌ కలెక్టరేట్‌ తోపాటు జిల్లాలోని కార్యాలయాల దగ్గర ధర్నా చేస్తామన్నారు. ఈ నెల 12న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు ధర్నా కొనసాగుతుందని వివరించారు.

పంజాబ్‌లో ధాన్యాన్ని కొంటున్నప్పుడు తెలంగాణలో ఎందుకు కొనరని మంత్రి ప్రశ్నించారు. యాసంగిలో ధాన్యం నూక ఎక్కువ వస్తుందని, గిట్టుబాటు కాదని చెప్పారు. వంద కిలోల ధాన్యానికి 67 కిలోల బియ్యం ఇవ్వాలని ఎఫ్‌సీఐ నిబంధన పెట్టిందన్నారు.  సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ఇప్పుడిప్పుడే రైతులు బాగుపడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో రైతులకు రైతుబంధు, ఉచిత కరెంటు, సాగునీరు అందిస్తున్నామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement