Sunday, April 14, 2024

గురుకులాల్లో డిజిటల్ లెర్నింగ్ వసతులు

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా బీసీ గురుకులాలు పనిచేయాలి మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మహాత్మా జ్యోతిభాపూలే తెలంగాణ వెనుకబడిన వర్గాల సంక్షేమ గురుకుల సొసైటీ బోర్డు మీటింగ్ ఈరోజు మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన తన కార్యాలయంలో జరిగింది. బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఎంజేపీ గురుకులాల కార్యదర్శి మల్లయ్య బట్టు ఇతర డైరెక్లర్లు హాజరైన ఈ కార్యక్రమంలో 2022 -23 సంవత్సరానికి సంబందించిన ముఖ్య అంశాలను ఆమోదించారు.

ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. బీసీల సంక్షేమం కోసం అనేక విదాలుగా కృషి చేస్తున్నారని చెప్పారు. గతంలో దాదాపు 16 గురుకులాల ద్వారా కొద్ది మందికి మాత్రమే విద్యను అందించారని, కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత నేడు 281 బీసీ గురుకులాల్లో వేలాదిమంది విధ్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. ముఖ్యంగా విద్యార్థులకు వేడినీటితో స్నానం చేసే అవకాశాలు కల్పించడం కోసం టీఎస్ రెడ్కో ఆధ్వర్యంలో ప్రతీ గురుకులంలో సోలార్ వాటర్ హీటర్లను ఏర్పాటు చేయాలని మంత్రి గంగుల కమలాకర్ చేసిన ప్రతిపాధనకు అందరూ ముక్త కంఠంతో ఆమోదించారు. మొన్నటి బాన్సువాడ బీర్కూర్ స్కూల్ శంకుస్థాపనలో ఇచ్చిన హామీని మంత్రి గంగుల నెరవేర్చారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే సీఏం కేసీఆర్ లక్ష్యంలో భాగంగా తొమ్మిదో తరగతి వరకు 1,276 గురుకులాల్లో ఉన్న డిజిటల్ క్లాస్ రూం, ఈ లెర్నింగ్ క్లాస్ రూంలను ఈ సంవత్సరానికి 1,696 గురుకులాల్లో ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు.  గురుకులాలను అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు అకడమిక్ సెల్, ఇంటర్నల్ ఆడిట్ టీంలను మరింత బలపర్చడమే కాకుండా, హైజీనిక్, బిల్డింగ్ అప్పియరెన్స్, పుడ్ క్వాలిటీ అస్యూరెన్స్ తదితర కమిటీల ద్వారా అన్ని అంశాలను నిరంతరం పర్యవేక్షించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని బోర్డు తీర్మానించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement