Thursday, April 25, 2024

కేసీఆర్ ఫోటోనే గెలుపు మంత్రం

హుజురాబాద్ కార్యకర్తలు టీఆర్ఎస్‌తోనే ఉన్నారని.. అధైర్య పడాల్సిన అవసరం లేదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. వ్య‌క్తులు పోయినంత మాత్రానా టీఆర్ఎస్ కు ఎలాంటి న‌ష్టం లేదన్నారు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్ బాగా స్ట్రాంగ్‌ గా ఉందని.. ఎవరు గెలిచినా కేసీఆర్ బొమ్మ మీదనేనన్నారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త లేనేలేదు, వ‌రుస ఎన్నిక‌ల్లో విజ‌యాలే దీనికి నిద‌ర్శ‌నమని పేర్కొన్నారు. పార్టీ నిర్ణ‌య‌మే శ్రేణులకు శిరోదార్యం అని, తెలంగాణ‌లో టీఆర్ఎస్ తిరుగులేని శ‌క్తి అని మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ చెప్పారు. ఈట‌ల భూముల‌పై విచార‌ణ జ‌రుగుతోన్న నేప‌థ్యంలో ఆయ‌న సొంత నియోజ‌కవ‌ర్గం హుజురాబాద్ లోని త‌మ‌ కార్యకర్తలతో త్వరలో స‌మావేశం అవుతాన‌న్నారు. తాను కరీంనగర్ నియోజకవర్గం నుంచి, ఈటల హుజురాబాద్ నుంచి సీఎం కేసీఆర్ వ‌ల్లే గెలిచామ‌ని, ఆయ‌న‌ను చూసే త‌మ‌కు ప్ర‌జ‌లు ఓట్లు వేశార‌ని ఆయ‌న చెప్పారు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్ బ‌లంగా ఉందని తెలిపారు. అక్క‌డ‌ ఎవరు గెలిచినా కేసీఆర్ వ‌ల్లే గెలుస్తార‌ని చెప్పారు. పుట్ట మధు వ్యవహారంతో త‌మ‌ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని మంత్రి గంగుల స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement