Saturday, April 20, 2024

త్వరలో జనగామ TRS పార్టీ కార్యాలయం ప్రారంభోత్సం

ప్ర‌తి జిల్లాకు పార్టీ కార్యాల‌యంలో భాగంగా జనగామ TRS పార్టీ జల్లా కార్యాలయం త్వరలోనే ప్రారంభం అవుతుందని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. అలాగే ఉమ్మ‌డి జిల్లాలో మిగతా జిల్లాల పార్టీ కార్యాల‌యాలు ప్రారంభోత్స‌వానికి సిద్ధం అవుతున్నాయ‌ని తెలిపారు. ఆయా కార్యాల‌యాల‌ను సిఎం కెసిఆర్, పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ల చేతుల మీదుగా ప్రారంభోత్స‌వాలు జ‌రిపిస్తామ‌ని మంత్రి వెల్లడించారు. జ‌న‌గామ పార్టీ కార్యాల‌యాన్ని మంత్రి ఎర్ర‌బెల్లి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో కలిసి సంద‌ర్శించారు. నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించారు. కార్యాలయాలను చూశారు. పార్టీ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కాళోజీ, జ్యోతిరావు ఫూలే, సావిత్రి ఫూలే విగ్రహాలను పరిశీలించారు.

పార్టీ కార్యాలయం కొద్ది రోజుల క్రితం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కావాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల వాయిదా పడిందని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. త్వరలోనే సీఎంతో మాట్లాడి మరో డేట్ తీసుకుంటామని తెలిపారు. పార్టీ కార్యాల‌యాలు ప్రారంభ‌మైతే పార్టీ కార్య‌క‌లాపాల‌న్నీ అందులోనే జ‌రుపుకునే వీలు క‌లుగుతుంద‌న్నారు. పార్టీ శ్రేణుల‌కు కూడా అనుకూలంగా ఉంటుంద‌న్నారు. పార్టీ కార్యాల‌యాలు స‌ర్వాంగ సుంద‌రంగా స‌క‌ల స‌దుపాయాల‌తో నిర్మిస్తున్న‌ట్లు మంత్రి ఎర్ర‌బెల్లి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement