Saturday, April 20, 2024

10 ల‌క్ష‌ల మందితో విజ‌య‌గ‌ర్జ‌న.. ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి

టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భ‌వించి రెండు దశాబ్ధాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నవంబర్ 15న వరంగల్ లో విజయ గర్జన పేరుతో సభ నిర్వ‌హించనున్న సంగతి తెలిసిందే. వరంగల్ న‌గ‌ర స‌మీపంలో సుమారు 10లక్షల మందితో భారీ ఎత్తున స‌భ‌ను నిర్వ‌హించి, విజ‌య‌వంతం చేసేందుకు టీఆర్ఎస్ నేతలు శ్రీ‌కారం చుట్టారు. అందులో భాగంగా న‌గ‌రంలో మడికొండ శివార్ల‌లోని ఖాళీ స్థ‌లాల‌ను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ప‌రిశీలించారు.

టిఆర్ఎస్ పార్టీ విజ‌య గ‌ర్జ‌న స‌భ‌ను 10 ల‌క్ష‌ల మందితో భారీ ఎత్తున జ‌న‌స‌మీక‌ర‌ణ చేసి స‌భ‌ను విజ‌య‌వంతం చేయ‌డానికి ఎలాంటి అటంకాలు క‌లుగ‌కుండా అన్ని హంగులతో సభ నిర్వహించేందుకు అనువైన‌ స్థలాన్ని ప‌రిశీలిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపించి 20వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా పార్టీ సాధించిన విజయాలను, ప్రభుత్వం సాధించిన ప్రగతిని ముఖ్య‌మంత్రి కేసిఆర్ పార్టీ శ్రేణులు, ప్రజలకు నివేదిస్తారని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు తెలిపారు.

ఇది కూడా చదవండి: ‘ధరణి’కి ఏడాది.. 10 లక్షలకుపైగా లావాదేవీలు

Advertisement

తాజా వార్తలు

Advertisement