Thursday, April 25, 2024

సీనియర్ల వేధింపులతో వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యా యత్నం

వరంగల్ కేఎంసీలో పీజీ వైద్య విద్యనభ్యసిస్తున్న డాక్టర్ ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రెండు రోజుల క్రితం సీనియర్ డాక్టర్లు ప్రీతిని వేధించగా, ఆమె కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రిన్సిపాల్ వారిని మందలించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున వరంగల్ ఎంజీఎంలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలోనే డాక్టర్ ప్రీతి హానికర ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని, గమనించిన తోటి వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు.

కాగా, డాక్టర్ దరావత్ ప్రీతి అనస్తీషియా పీజీ స్టూడెంట్ అని, హైదరాబాద్ కు చెందిన ఆమె ఆత్మహత్యకు యత్నించడం ప్రస్తుతం వైద్య వర్గాల్లో చర్చనీయాంశమైంది. కాగా, డాక్టర్ ప్రీతిని మెరుగైన వైద్యం కోసం ఎంజీఎం సిబ్బంది హైదరాబాద్ కు తరలించినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement