Tuesday, April 23, 2024

రైతు సంక్షేమానికి కృషి చేయండి : ఎంపీ కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి

దుబ్బాక : సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం కృషి చేస్తుందని పార్లమెంట్ సభ్యులు, సిద్దిపేట జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల నూతనంగా నియామకమైన దుబ్బాక మార్కెట్ కమిటీ చైర్మన్ జ్యోతి కృష్ణులతో పాటు పాలకవర్గంకు ఆయన సన్మానించి అభినందనలు తెలిపారు. రైతులకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి సహకారం అందించాలని ఆయన సూచించారు. తమపై నమ్మకంతో మార్కెట్ కమిటీ పాలక వర్గంలో అవకాశం కల్పించినందుకు ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement