Thursday, March 28, 2024

గుమ్మ‌డిద‌లలో మౌలిక వసతులు కల్పిస్తాం : ఎమ్మెల్యే జీఎంఆర్

గుమ్మడిదల మండలంలో అన్ని మౌలిక‌ వ‌స‌తులు క‌ల్పించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. రూ.20 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్ల నిర్మాణ పనులకు ఎంపీపీ సభ్య ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి జెడ్పిటిసి కుమార్ గౌడ్ లతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే మండల పరిధిలోని అన్నారం గ్రామంలో 18 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అంగన్వాడీ నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గుమ్మడిదల మండల పరిధిలో రహదారుల నిర్మాణానికి కోటి 25 లక్షల రూపాయలు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. వీటితోపాటు ప్రత్యేక అభివృద్ధి నిధుల ద్వారా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేయనున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. పల్లె ప్రగతి ద్వారా ప్రభుత్వం ఇప్పటికే ప్రతి గ్రామానికి ట్రాక్టర్ ట్రాలీ అందించడంతోపాటు, ప్రతినెల జనాభా ప్రాతిపదికన నిధులు అందిస్తోందని తెలిపారు. దీంతోపాటు అంగన్వాడీల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ప్రతి గ్రామంలో శాశ్వత భవనాలు నిర్మిస్తున్నామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement