Saturday, April 20, 2024

వడ్ల కొనుగోలుపై అవగాహన సదస్సు..

కొమురవెల్లి : కొమురవెల్లి మరియు కిష్టంపేట గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు పైన తాసిల్దార్‌ నీలిమ రైతులకు వడ్ల విక్రయం పైన రైతులతో ప్రజా ప్రతి నిధులతో అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈసారి ధాన్యం అమ్ముకునే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలాగకుండా పిఎసిఎస్‌ డైరెక్టర్లు మండల ప్రజాప్రతినిధులు జాగ్రత్తలు తీసుకోవాలని పంట అమ్ముకోవడానికి రైతులను ప్రోత్సహించాలని అన్నారు రైతులకు మద్దతు ధర 1880 ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపారు ఈ నెల 16వ తేదిన నుంచి కోనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సిద్దప్ప వైస్‌ ఎంపీపీ రాజేందర్‌ రెడ్డి రైతు కోఆర్డినేటర్‌ స్వాముల పల్లి కనుకచారి సర్పంచ్‌లు సార్ల లత కిష్ట య్య భీమన పల్లి కరుణాకర్‌ అన్నేబోయిన రవీందర్‌ ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement