Tuesday, April 16, 2024

అకాల వర్షం… వెయ్యి కోళ్లు మృతి

మెద‌క్ జిల్లాలోని వెల్దుర్తి మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన మల్లారెడ్డి కోళ్ల ఫారంలో వెయ్యి కోళ్లు మృతి చెందాయి. నిన్న కురిసిన భారీ వ‌ర్షానికి కోళ్ల ఫారం లోనికి వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరింది. దీంతో సుమారు 1000 కోళ్లు వరకు చనిపోవడం జరిగిందని యజమాని మల్లారెడ్డి తెలిపారు. వీటి విలువ లక్ష రూపాయలు ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. త‌మ‌ను ప్ర‌భుత్వ‌మే ఆదుకోవాల‌ని కోరుతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement