Tuesday, March 26, 2024

FLASH NEWS : ట్రాక్ట‌ర్ డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యానికి ఇద్ద‌రు విద్యార్థులు బలి.. మరొకరి పరిస్థితి విషమం.

మెదక్ జిల్లా రంగంపేటలో విద్యార్థుల‌పైకి ట్రాక్ట‌ర్ దూసుకొచ్చింది. ఈ ఘ‌ట‌న‌లో ఒక విద్యార్థి అక్క‌డిక‌క్క‌డే మృతి చెంద‌గా.. మ‌రో విద్యార్థి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మ‌రో విద్యార్థి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు. వివ‌రాల్లోకి వెళితే.. రంగంపేట‌లో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో చ‌దువుతున్న ముగ్గురు విద్యార్థులు పాఠ‌శాల నుంచి హాస్ట‌ల్ వెళుతున్న క్ర‌మంలో ఏడుపాయ‌ల వైపు వెళుతున్న ట్రాక్ట‌ర్ విద్యార్థుల‌ను ఢీకొట్టింది.

ఈ ప్ర‌మాదంలో రజినీకాంత్ అనే విద్యార్థి అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. మ‌రో ఇద్ద‌రు విద్యార్థుల‌కు తీవ్ర గాయాలు కావ‌డంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతుండ‌గా మ‌రో విద్యార్థి మృతి చెందిన‌ట్లు వైద్యులు తెలిపారు. మూడో విద్యార్థి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు వెల్ల‌డించారు. ట్రాక్ట‌ర్ డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యంతోనే ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ముగ్గురిలో ఇద్ద‌రు విద్యార్థులు మెదక్ పట్టణవాసుల‌ని తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement