Thursday, April 25, 2024

జాతీయ జెండా ఎగురవేస్తూ విద్యుత్ ఘాతంతో ఇద్దరు మృతి

ప‌టాన్ చెరు : స్వాతంత్ర్య దినోత్సవం రోజున జాతీయ జెండా ఎగురవేస్తూ ఇద్దరు మృతి చెందడం పట్ల ప‌టాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం తరఫున అన్ని విధాల ఆదుకుంటామని తెలిపారు. సంఘటన విషయం తెలియగానే.. ప‌టాన్ చెరు పట్టణంలో మాక్స్ క్యూర్ ఆసుపత్రికి వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. మృతదేహాలకు ప‌టాన్ చెరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, వారి స్వగ్రామాలకు తరలించాలని డీఎస్పీ భీమ్ రెడ్డిని ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement