Sunday, April 14, 2024

సిద్దిపేట జిల్లాలో టీఆర్ఎస్ vs బీజేపీ ర‌గ‌డ‌

తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో మరోసారి టీఆర్ఎస్, బీజేపీల మధ్య రగడ చెలరేగింది. భూంపల్లి – అక్బర్ పేట తహశీల్దార్ కార్యాలయంలో కార్యక్రమం రసాభాసగా మారింది. రాష్ట్ర‌ మంత్రి హరీశ్ రావు, బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అనుచరుల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పోటాపోటీ నినాదాలు చేస్తూ బాహాబాహికి దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement