Wednesday, April 24, 2024

కార్యకర్తలకు అండగా టీఆర్‌ఎస్..

‌ హవేళిఘనపూర్ : మండలంలోని గాజిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన లంబాడి రాము గత కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు మెదక్‌ పట్టణంలో మరణించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదు గతంలో చేసుకోగా ఆయన మరణానంతరం ఇన్సూరెన్స్‌ రావడంతో ఆయన కుటుంబానికి చెక్కు అందజేయడం చేశామని టిఆర్‌ఎస్‌ నాయకులు సాప సాయిలు తెలిపారు. అదే గ్రామానికి చెందిన భాగ్యమ్మకు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరగా ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 16వేల ఆరువందల రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో బూర్గుపల్లి సర్పంచ్‌ చెన్నాగౌడ్‌, గాజిరెడ్డిపల్లి సర్పంచ్‌ భాగ్యలక్ష్మీ శ్రీనివాస్‌, పోచయ్య, బిక్షపతి, తులసిరామ్‌ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement