Thursday, April 25, 2024

పిజెఆర్ కాలనీలో విషాదం.. నీటి గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి

ఆడుకుంటూ ఇద్దరు చిన్నారులు నీటి గుంత లో పడి మృతిచెందిన విషాద ఘటన అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిజెఆర్ కాలనీలో గురువారం జరిగింది. బాధితులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… స్వర్ణపురి కాలనీకి చెందిన ఆయుష్ కుమార్ (7) సౌరబ్ కుమార్ (8) ఇద్దరు ఆడుకుంటూ సమీపంలోని నీటి గుంతలో పడి ప్రమాదవశాత్తు మృతి చెందినట్లుగా తెలుస్తోంది.

ఇద్దరు చిన్నారుల మృతితో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ఒక్కసారిగా చిన్నారుల మృతితో స్వర్ణపురి కాలనీ లో విషాదఛాయలు అలుగుకున్నాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పటాన్ చెరువు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement