Friday, April 26, 2024

సిద్దిపేట జిల్లాలో పులి సంచారం.. లేగదూడపై దాడి..

తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతుంది.దుబ్బాకలోని మల్లాయిపల్లిలో పులి కనిపించిందని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలోనే లేగ దూడపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో స్థానిక ప్రజలు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు. అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు పులి పాదముద్రలను గుర్తించే పనిలో పడ్డారు. పెద్దపులి సంచరిస్తూ.. లేగదూడపై దాడి చేయడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement