Friday, April 19, 2024

యువకుడు ఆత్మహత్య

క్ష‌ణికావేశంతో ఓ యువ‌కుడు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన ఘ‌ట‌న మెద‌క్ జిల్లాలోని వెల్దుర్తి ప‌రిధిలో చోటుచేసుకుంది. వెల్దుర్తి మండలంలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన కుక్కల మైపాల్ అనే వ్యక్తి శుక్రవారం సాయంత్రం ఇంట్లో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్ళి వెళ్ళిపోయాడు. రెండు రోజులుగా కొడుకు కోసం తండ్రి అన్వేషించగా ఈరోజు ఉదయం తన తండ్రి అడవిలో వెతుకుతుండగా ఒక చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించి గుండెలు పగిలేలా బోరున విలపించాడు. ఈ సంఘటనతో ఆరెగూడెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటన తెలుసుకున్న స్థానిక ఎస్ఐ మహేందర్ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement