Thursday, April 25, 2024

బాలుడి ప్రాణం తీసిన గాలిపటం

గాలిప‌టం ఎగుర‌వేస్తూ క‌రెంట్ వైర్ల‌కు త‌గిలి చిన్నారి మృతి చెందిన ఘ‌ట‌న పటాన్ చెరులోని జిన్నారం మండలం ఐడీఏ బొల్లారంలో చోటు చేసుకుంది. స్నేహితులతో కలిసి సరదాగా గాలిపటాలు ఎగరవేస్తుండగా గాలిపటం బిల్డింగ్ కు ఆనుకొని ఉన్న విద్యుత్ వైర్లకు చిక్కింది. దీంతో ఆ బాలుడు బిల్డింగ్ పైకి వెళ్లి గాలిపటం తీయబోయి విద్యుత్ వైరుకు చేయి తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. విద్యుత్ అధికారులు నిర్ల‌క్ష్యం తోనే బాలుడు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు కరెంటు వైర్లు ఎక్కడున్నా వాటికి ప్లాస్టిక్ పైపులు వేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని బొల్లారం వాసులు కోరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement