Thursday, April 25, 2024

కోర్టు దుబ్బాకలోనే యధావిధిగా కొనసాగుతుంది : ఎంపీ ప్ర‌భాక‌ర్ రెడ్డి

దుబ్బాక ముఖ్య నాయకులు ఈరోజు హైదరాబాద్ లోని ఎంపీ నివాసంలో కలసి దుబ్బాక కోర్టుని ఎక్కడికీ తరలించకుండా దుబ్బాక లోనే యధావిధిగా కొనసాగించాలని, కోర్టు భవనానికి సరిపడా భూమిని సేకరించి త్వరలో అప్పగిస్తామని వినతిపత్రం అందించడం జరిగింది. దీనికి సానుకూలంగా స్పందించిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి వెంటనే మంత్రి తన్నీరు.హరీష్ రావు దృష్టికి తీసుకుపోగా వెంటనే మంత్రి స్పందించి జిల్లా కలెక్టర్ ని ఆదేశించడం జరిగింది. ఈ సంద‌ర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. దుబ్బాకలోని కోర్టు ఎక్కడికీ తరలిపోదని, దుబ్బాకలోనే త్వరలో నూతన భవనం నిర్మించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామని హామీ ఇచ్చారు. భాధ్యతారాహిత్యంతో దుబ్బాక లోని ప్రతిపక్ష నాయకులు అనవసరంగా ప్రజల్లో ఆందోళనలు పెంచేలా, విద్వేషాలు పెంచేలా కుట్ర రాజకీయాలు చేస్తున్నారన్నారు. వారి భాధ్యతను వారు కనీసం నిర్వహించకుండా, ప్రశాంతంగా ఉండే దుబ్బాకను అశాంతికి గురిచేసే రాజకీయాలు చెల్లవన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement