Friday, March 29, 2024

దేవాలయాలు సాంస్కృతిక వారసత్వ చిహ్నాలు : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారం : దేవాలయాలు సాంస్కృతిక వారసత్వానికి చిహ్నాలని పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. జిన్నారం మండలం జంగంపేటలో సోమవారం ఏర్పాటు చేసిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే జీఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన వివిధ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో నూతన ఆలయాల నిర్మాణాలకు సహకరించడంతో పాటు, పురాతన ఆలయాలను జీర్ణోద్ధరణ చేస్తున్నామని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలను ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement