Wednesday, April 24, 2024

విద్యార్థులు క్రమశిక్షణతో చదివి లక్ష్యం దిశగా అడుగులు వేయాలి : ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు

పనులు పూర్తయిన నాలుగు సంవత్సరాలకు ఎట్టకేలకు దుబ్బాక ప్రభుత్వం ఉన్నత పాఠశాల ప్రారంభమైంద‌ని, సంవత్సరాల కల నెరవేరిన సందర్భంగా దుబ్బాక ఉన్నత పాఠశాల, కళాశాల విద్యార్థులకు దుబ్బాక ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు శుభాకాంక్షలు తెలిపారు. మంగ‌ళ‌వారం పాఠశాలను ఎమ్మెల్యే రఘునందన్ సందర్శించి, మార్నింగ్ ప్రేయర్ లో పాల్గొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి లక్ష్యం దిశగా అడుగులు వేయాల‌న్నారు. పాఠశాల విద్యార్థులతో కలిసి ముచ్చుటించి విద్యార్థులకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను వీలైనంత త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఎంఈఓ ఎమ్మెల్యే రఘునందన్ రావుకి వినతిపత్రం అందజేశారు. పట్టణాల సిబ్బంది కోరిక మేరకు విద్యార్థుల ఎలక్ట్రానిక్ వాటర్ ఫిల్టర్ అందజేశారు. త్వరలో మళ్లీ వస్తానని పాఠశాల లో పిచ్చి మొక్కలు లేకుండా చూడాలని పాఠశాల సిబ్బందిని ఆదేశించారు. త్వరలో పాఠశాల ఆవరణలో శ్రమదానం నిర్వహిస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement