Tuesday, April 23, 2024

క్రీడ‌లు మాన‌సికోల్లాసాన్ని పెంపొందిస్తాయి : హెచ్‌డీసీ చైర్మ‌న్ చింతా ప్ర‌భాక‌ర్‌

సదాశిపేట రూరల్: సదాశివపేట మండల పరిధిలోని నంది కంది గ్రామంలో గురువారం యునైటెడ్ క్రికెట్ లీక్ మ్యాచ్ రాచర్ల విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్‌ను రాష్ట్ర హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని యువకులతో క్రికెట్ ఆడి సందడి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నంది కంది గ్రామంలో ఇటువంటి క్రికెట్ మ్యాచ్ ప్రారంభించడం నాకు ఎంతో సంతోషం అన్నారు. నేటి క్రికెట్ మ్యాచ్ వల్ల నంది కంది యువకులు మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. ఈ మ్యాచ్ నిర్వాహకులు రాచర్ల విజయభాస్కర్ రెడ్డి ముందుకొచ్చి ఈ టోర్నమెంట్ నిర్వహించడం ఎంతో శుభసూచకం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ రాజేందర్ రెడ్డి కోచ్ శ్రీనాథ్ రెడ్డి , గ్రామ సర్పంచ్ కుందన రాజు, ఉప సర్పంచ్ సునీల్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement