Thursday, April 18, 2024

ఫిర్యాదుల పరిష్కారానికి సత్వర చర్యలు..ఎస్పీ ర‌మ‌ణ‌కుమార్..

ఫిర్యాదుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటున్నామ‌ని సంగారెడ్డి ఎస్పీ రమణ కుమార్ తెలిపారు..సంగారెడ్డి లో గత కొన్ని రోజుకుగా మీ సేవా ద్వారా వచ్చిన ఫిర్యాదులలో 10 ఫిర్యాదులను సంగారెడ్డి సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించి ..బాధితులకు అడిషనల్ ఎస్పీ సృజన చేతుల మీదుగా సెల్ ఫోన్ ని అందజేశారు.. ఈ సందర్బంగా ఎస్పీ రమణ కుమార్ మాట్లాడుతూ మీ సేవ ద్వారా ప‌ది సెల్ ఫోన్ లు పోగొట్టుకున్నట్లు బాధితులు పిర్యాదు చేయగా.. సైబర్ క్రైం ద్వారా విచారణ చేపట్టి ఏడు సెల్ ఫోన్ లను బాధితులకు అందజేసినట్లు ఎస్పీ స్పష్టం చేశారు..

జిల్లాలో ఎవరైనా సెల్ ఫోన్ లు పోగొట్టుకున్నట్లయితే వెంటనే మీసేవా ద్వారా ఫిర్యాదు చేసుకోవాలని తెలియజేశారు. ఏవయినా వస్తువులు / సెల్ ఫోన్ లు ఎవరికైనా దొరికితే సంబంధిత పోలీస్ స్టేషన్ లో అందచేయాలన్నారు. సెకండ్ హ్యాండ్ మొబైల్ లను కొనుగోలు చేసే ముందు సంబంధిత వ్యక్తి నుండి ఫోన్ కొంటే బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలని ఆయన సూచించారు. సెల్ ఫోన్ లను రికవరీ చేయడంలో కీలకంగా వ్యవహరించిన ఐటీ సెల్ సభ్యులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ శ్రీనివాస్ నాయుడు, ఐటీ సెల్ ఎస్సై కృష్ణయ్య, ఐటీ సెల్ సభ్యులు పాల్గొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement