Thursday, April 18, 2024

ప్రతి ఒక్కరు జాగ్రత్త..

నర్సాపూర్‌ : మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం వ్యాప్తంగా కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్డీఓ రవీందర్‌రెడ్డి అన్నారు. నర్సాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో హెల్త్‌ సిబ్బంది, పోలీస్‌, మున్సిపల్‌, రెవెన్యూ సిబ్బందితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు భౌతికదూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని ఆయన వెల్లడించారు. కరోనా వైరస్‌ బారినపడితే ఎవరు భయానికి గురికాకుండా ధైర్యంతో ఉండాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి డిఎంహెచ్‌ ఓ విజయనిర్మల, మున్సిపల్‌ కమిషనర్‌ ఆశ్రీత్‌కుమార్‌ , ఎస్‌ఐ గంగరాజు, తహశీల్దార్‌ తిరుమలరావు, డాక్టర్‌.మిర్జాబేగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement