Tuesday, April 23, 2024

ప్రజా ప్రతినిధులకు అవగాహన సదస్సు..

కొల్చారం : ఉగాది పర్వదినం సందర్భంగా గ్రామాల్లో ఎలాంటి జాతర ఏర్పాట్లు నిర్వహించరాదని మండల ప్రత్యేకాధికారి బాబునాయక్‌ తెలిపారు. మండల ప్రజాపరిషత్‌ సమావేశ మందిరంలో సర్పంచ్‌లు, ఎంపిటిసి సభ్యులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కరోనా మహమ్మారి వైరస్‌ తీవ్రంగా ఉండడంతో గ్రామాల్లో కోవిడ్‌ నిబంధనలు పాటించాలని, ఎలాంటి జాతర ఏర్పాట్లు నిర్వహించవద్దని ఆయన సూచించారు. జాతర ఏర్పాట్లపై ఈ సమావేశంలో తీర్మాణం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంజుల కాశీనాథ్‌, తహశీల్దార్‌ చంద్రశేఖర్‌రావు, ఎంపిడివో ప్రవీణ్‌కుమార్‌, ఎస్‌ఐ సార శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపిఓ క్రిష్ణవేణి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement