Thursday, April 18, 2024

పోలీస్ కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్ష ప్ర‌శాంతం : ఎస్పీ రమణ కుమార్

సంగారెడ్డి : తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూటుమెంట్ బోర్డు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్ష సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా జరిగిన పోలీస్ కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష కేంద్రాల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేయించడంతో పాటు, స్వయంగా ఎస్పీ ర‌మ‌ణ కుమార్ పర్యవేక్షించడం జరిగింది. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 43 పరీక్షా కేంద్రాలలో 18,451 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 17,083 మంది పరీక్షకు హాజరుకాగా, 1368 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. 92 .58% హాజరు శాతం నమోదైంది. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాకు చెందిన పరీక్షా కేంద్రాలు పటాన్ చేరు సబ్-డివిజన్ లో 17 కేంద్రాలలో నిర్వహించడం జరిగింది. అన్ని పరీక్ష కేంద్రాలలో అభ్యర్ధులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాయడం జరిగిందన్నారు. అక్కడక్కడా బయోమెట్రిక్ సమస్యలు తలెత్తగా పోలీసు సిబ్బంది వెంటనే పింగర్ ప్రింట్ విధానం ద్వారా పరిస్కరించడం జరిగిందన్నారు. ఈ పరీక్ష కేంద్రాలను సందర్శించిన సమయంలో ఎస్పీతో సంగారెడ్డి జిల్లా నోడల్ అధికారి జహీరాబాద్ డీఎస్పీ వీ.రఘు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement