Wednesday, April 24, 2024

ప్రణాళిక బద్ధంగా డివిజన్ల అభివృద్ధి : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు : బ‌ల్దియ పరిధిలోని డివిజన్లను ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని బండ్లగూడ నేతాజీ నగర్ కాలనీలో 16 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పటాన్ చెరు డివిజన్ పరిధిలో సీసీ రోడ్ల నిర్మాణ పనుల కోసం ప్రభుత్వం ఇటీవల ఐదు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఇందుకు అనుగుణంగ నిర్మాణ పనులు చేపడుతున్నామని తెలిపారు. మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట‌ వేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, రామచంద్రపురం మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, భారత్ రాష్ట్ర సమితి పట్టణ అధ్యక్షులు అఫ్జల్, బండ్లగూడ ఏరియా అధ్యక్షులు గోపాల్, కొమరగూడెం వెంకటేష్, చంద్రశేఖర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement