Thursday, March 28, 2024

ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత : నీలం మ‌ధు ముదిరాజ్‌

జిన్నారం మండలం జంగంపేట గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన శ్రీ ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిష్టాపన మహోత్సవ నిర్వాహకులు నీలం మధు ముదిరాజ్ ని ఘనంగా సత్కరించారు. అనంతరం పీఠాధిపతుల ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత ఉంటుంద‌ని, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తాను ఎప్పుడు ముందుంటానని నీలం మధు తెలిపారు. ఎల్లమ్మ తల్లి అందరినీ సుఖసంతోషాలతో చూడాలని, నియోజకవర్గ ప్రజల సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకటయ్య, ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, ఎంపిటిసి వెంకటేశం గౌడ్, వార్డు సభ్యులు శంకర్ అప్ప, జోగు మహేష్, శ్రీనివాస్, నవీన్ కుమార్, శ్రీకాంత్, యాదగిరి, చన్, అంజి, గోపాల్ రెడ్డి, చిరంజీవి, కుమార్, నాగరాజ్, మహేష్, శ్రీశైలం, బాసి రెడ్డి, క్రిష్ణ రెడ్డి, గ్రామ పెద్దలు,ప్రజలు, ఎంఎన్ఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement