Saturday, April 20, 2024

తన చితిని తానే పేర్చుకుని.. మల్లన్నసాగర్ నిర్వాసితుడి ఆత్మహత్య

మ‌ల్ల‌న్న సాగ‌ర్ ముంపు గ్రామాల నిర్వాసితుల స‌మ‌స్య‌లు ఇంకా తీర‌డం లేదు. అంద‌రికీ న్యాయం జ‌రిగాకే, ప‌రిహారం అందాకే గ్రామాల‌ను ఖాళీ చేయిస్తామ‌ని చెప్పిన ప్ర‌భుత్వం.. తాత్కాలిక బుజ్జ‌గింపుల‌తో ముందుకు వెళ్లింది. దీంతో ఏదో ఒక వివాదంతో మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ నిర్వాసితులు రోడెక్కుతున్నారు. తాజాగా మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ ముంపు గ్రామం వేములఘాట్‌లో విషాదం చోటు చేసుకుంది.

తుటుకూరి మల్లారెడ్డి( 70) బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రాకపోవడంతో ఆ మనో వేదనతోనే బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో గ్రామంలో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. అధికారులు మాత్రం మల్లారెడ్డి ఇంట్లో అర్హులందరికీ ప‌రిహారం అందించామ‌ంటున్నారు.

కాగా వేములఘాట్‌లో సజీవదహనం జరిగిన ఘటనా స్థలానికి వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావును తుక్కాపూర్ వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement