Thursday, March 28, 2024

నూతన అధ్యక్షులకు సన్మానం..

హవేళిఘణపూర్ :కూచన్‌పల్లి గౌడసంఘం అధ్యక్షుడిగా దమ్ము వెంకట్‌గౌడ్‌ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కూచన్‌పల్లి రేణుకమాత ఆలయంలో గౌడ సంఘం సభ్యులు నిర్వహించిన సమావేశంలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌడ సొసైటీ కోసం అందరితో కలిసి పనిచేస్తానని గౌడజాతి అభివృద్ది కోసం కృషి చేస్తానని నూతన అధ్యక్షులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ దేవాగౌడ్‌, సుధాకర్‌ గౌడ్‌, కిష్టాగౌడ్‌, నారాగౌడ్‌, యాదాగౌడ్‌, దుర్గాగౌడ్‌, రమేష్‌గౌడ్‌, నవీన్‌గౌడ్‌, నాగరాజుగౌడ్‌, కూచన్‌పల్లి గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement