Thursday, April 25, 2024

మాస్కులు ధరించని వారికి జరిమానా..

కొల్చారం : కోవిడ్‌ నిబంధనలు పాటించకుండా మాస్కులు ధరించకుండా తిరిగే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడుతాయని ఎస్‌ఐ సార శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. మండల పరిధిలోని రంగంపేట బస్టాండ్‌ వద్ద మాస్కులు దరించకుండా తిరుగుతున్న వారిని గమనించి వారికి జరిమానాలు విధించామని చెప్పారు. కరోనా వైరస్‌ రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో ప్రతి ఒక్కరు బాధ్యత వహించి కోవిడ్‌ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి సామాజిక దూరాన్ని పాటించాలని ఆయన వెళ్లడించారు. ప్రతి ఒక్కరు మాస్కులు దరించి కోవిడ్‌ నిబంధనలు పాటించాలన్నారు. లేనియెడల చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement