Saturday, April 20, 2024

ఎంపిపి నారాయణరెడ్డికి సన్మానం..

హవేళిఘణపూర్ : మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డి సహకారంతో మండలాన్ని అభివృద్ది చేస్తానని ఎంపీపీ నారాయణరెడ్డి అన్నారు. మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీల జిల్లా గౌరవ అధ్యక్షుడిగా ఎంపీపీ నారాయణరెడిడె ఎంపిక పట్ల మండలంలోని సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, ప్రజాప్రతినిధులు ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ కుటుంబంలో పుట్టి రాజకీయాలకు దూరంగా ఉంటున్న సమయంలో ఎమ్మెల్సీ సహకారంతో మండలంలో ఎంపిటిసి, ఎంపిపి పదవి జనరల్‌ రావడంతో ఎంపీపీ అవకాశం దక్కిందన్నారు. మండలంలో సమస్యలు ప్రజా ప్రతినిధులకు అధికారులకు మధ్య ఉండి సానుకూలంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీరామ్‌, ఎంపీఓ ప్రవీణ్‌కుమార్‌, ఏపీ ఓ రాజ్‌ కుమార్‌, మండలంలోని సర్పంచ్‌లు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement