Thursday, April 25, 2024

అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే‌..

పటాన్‌చెరు : విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారిని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్‌రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం ఆలయ ఈవో ఎమ్మెల్సేని శాలువతో సన్మానించి అమ్మవారి చిత్రపటాన్ని బ హుకరించారు. ఈ కార్యక్రమంలో అమీన్‌పూర్‌ జెడ్‌పిటీసీ సుధాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు యాదగిరియాదవ్‌, శ్రీశైలంయాదవ్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు దశరథ్‌రెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement