Thursday, April 25, 2024

నిధుల వినియోగంపై మండల పరిషత్‌ సమావేశం..

వెల్దుర్తి : 2020-21 సంవత్సరానికి గాను మంజూరైన 15వ ఫైనాన్స్‌ నిధుల వినియోగంపై మండల పరిషత్‌ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎంపిపి స్వరూప, జడ్పీటిసి రమేష్‌గౌడ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 15వ ఫైనాన్స్‌ నిధులతో గ్రామాల్లో ప్రజలకు అవసరమయ్యే మౌళిక వసతుల కల్పనకు వినియోగించుకోవాలని ప్రజాప్రతినిధులకు అధికారులు సూచించారు. అలాగే నిధుల వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ జగదీశ్వరాచారి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement