Friday, March 29, 2024

పొలం దున్నుతుండగా బయటపడిన వినాయకుడి విగ్రహం

తెలంగాణ: సంగారెడ్డి జిల్లాలో ఓ పొలం దున్నుతుండగా భారీ వినాయకుడి విగ్రహం ఒకటి బయటపడింది. జిల్లాలోని నారాయణఖేడ్ మండలం తుర్కపల్లికి చెందిన అనంతరావు దేశ్‌ముఖ్ అనే రైతు పంట సాగు కోసం నిన్న సాయంత్రం ట్రాక్టర్‌తో పొలం దున్నించారు.

ఈ క్రమంలో ట్రాక్టర్ నాగలికి తగిలి గణేశుడి విగ్రహంతోపాటు దానిని ప్రతిష్ఠించే భారీ పీఠం బయటపడ్డాయి. విషయం తెలిసిన గ్రామస్థులు విగ్రహాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో కోలాహలం నెలకొంది.

ఈ వార్త కూడా చదవండి: 6వ తరగతి బాలుడి ప్రాణం తీసిన ఆన్‌లైన్ గేమ్

Advertisement

తాజా వార్తలు

Advertisement