Thursday, April 25, 2024

కిరాణవర్తక సంఘం లాక్‌డౌన్..

రామాయంపేట : కరోనా వ్యాధులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం నుండి లాక్‌డౌన్‌ చేపడతామని రామాయంపేట కిరాణా వర్తకసంఘం ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వ్యాధి పట్టణంలో రోజు రోజుకు పెరుగుతున్న ఈ క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు స్వచ్చందంగా అన్ని కిరాణా షాపుల యజమానులు ముందుకు వచ్చారన్నారు. కరోనా వ్యాధి కట్టడి కోసం తమ వంతు కృషిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement