Wednesday, March 27, 2024

జాతీయ రాజ‌కీయాల్లో కేసీఆర్ రాణించాలని.. సింహాచలంలో ఎమ్మెల్యే కేపి పూజలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో అడుగుపెడుతున్న నేపథ్యంలో భగవంతుడి అనుగ్రహం, ప్రజల ఆశీర్వాదంతో కీలక భూమిక పోషించాలని ఉత్తరాంధ్ర సేవాసమితి నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోట్లాడి సాధించిన రాష్ట్రాన్ని అతి తక్కువ సమయంలోనే అభివృద్ధి, సంక్షేమానికి చిరునామాగా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాలను కూడా అదే విధంగా ముందుంచేలా భగవంతుడు శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని వేడుకున్నట్లు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ తెలిపారు.

నీటి కష్టాలు, కరెంటు సమస్యలు శాశ్వతంగా పరిష్కరించి, ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులు ఆకర్షిస్తూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, రైతు సంక్షేమ పథకాలు, ఆసరా పింఛన్లకు పెద్దపీట వేస్తూ ఎటువంటి సంక్షోభం ఏర్పడినా అనేక కార్యక్రమాలను దిగ్విజయంగా అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి తప్పక అవసరమన్నారు. బీజేపీ ఆగడాలు రోజురోజుకు పెరిగిపోవడం, విపక్ష హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమవడం వల్ల దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ ప్రత్యామ్నాయ నాయకత్వ అవసరం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర సేవాసమితి నాయకులు ఎస్.రవి కుమార్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement