Thursday, April 25, 2024

రేప‌టి నుంచి పేట పట్టణంలో ‘కంటి వెలుగు’ : మున్సిప‌ల్ కమిషనర్ కృష్ణారెడ్డి

సదాశివపేట : సదాశివపేట పట్టణంలో రేప‌టి(గురువారం) నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని మున్సిపల్ కార్యాలయం మెప్మా హాలు నందు రాష్ట్ర హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో ప్రారంభిస్తున్నట్లు పురపాలక సంఘం కమిషనర్ కృష్ణారెడ్డి బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బుధవారం ఒకటో వార్డులో పురపాలక సంఘం చైర్ పర్సన్ పిల్లోడి జయమ్మ ఆధ్వర్యంలో ఓల్డ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కంటి వెలుగు కార్యక్రమం, 14వ వార్డు కౌన్సిలర్ టీచర్ ఆగడిరేణుక పురపాలక సంఘం మెప్మా హాలులో 19వ తేదీ నుండి 25 తేదీ వరకు నెంబర్ 1లో వార్డ్ ఆఫీసర్గా జి.చంద్రశేఖర్, 14వ వార్డ్ ఆఫీసర్గా జి కిషోర్ లు ఉంటారని, ఇట్టి కంటి వెలుగు కార్యక్రమాన్ని 1 ఒకటి 14 వార్డులో ఉన్న ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement