Friday, April 26, 2024

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వేడుకలు జరపాలి – ఎమ్మెల్యే జగ్గారెడ్డి

సంగారెడ్డి, ప్రభ న్యూస్ః కోవిడ్ నిబంధనలు పాటిస్తూ శ్రీ రామనవమి వేడుకలు జరుపుకోవాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. శనివారంనాడు శ్రీరామనవమి వేడుకలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ నిబంధనల ప్రకారమే శ్రీ రామనవమి ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. భక్తులు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే దర్శనం చేసుకోవాలని, గత సంవత్సరం కూడా కోవిడ్ వైరస్ వల్ల శ్రీరామ కల్యాణం మండపంలోనే జరిగిందన్నారు. ఈ సారి కూడా అదే విధంగా జరపనున్నట్లు వివరించారు. కోవిడ్ వ్యాప్తి ఎక్కువ ఉండడం వల్ల ప్రసాదం పెట్టడం లేదని, అలాగే ముత్యాలు కూడా పెట్టడం లేదని తెలిపారు. గత సంవత్సరంలో చీకటి ఉండకూడదని ఈసారి ఉగాది నుండి హనుమాన్ జయంతి వరకు లైటింగ్ ఏర్పాటు చేశామన్నారు. దయచేసి ప్రజలు,భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వేడుకలను జరుపుకోవాలని, ప్రజలు, భక్తులు సహకరించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement