Friday, April 19, 2024

ప‌టాన్ చెరులో ఎగిసిపడిన గ్యాస్‌ నిరసన జ్వాలలు..

పటాన్ చెరు : వంటగ్యాస్ ధర పెంపుపై జిల్లా వ్యాప్తంగా రెండోరోజు నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. ప్రధాని మోదీ, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తాయి. పటాన్చెరు పట్టణంలోని జాతీయ రహదారిపై పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. భారీ సంఖ్యలో భారత రాష్ట్ర సమితి ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement