Saturday, April 20, 2024

కాలనీల అభివృద్ధికి సంపూర్ణ సహకారం : ఎమ్మెల్యే జీఎంఆర్

అమీన్ పూర్ : నూతనంగా ఏర్పాటు అవుతున్న కాలనీలలో మౌలిక వసతుల కల్పనతో పాటు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటేల్ గూడ గ్రామ పరిధిలోని సిద్దార్థ ఎంక్లేవ్ కాలనీలో జీవీఆర్ ఎంటర్ ప్రైజ‌స్ సంస్థ సిఎస్ఆర్ కార్యక్రమాల్లో భాగంగా 60 లక్షల రూపాయలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. కాలనీ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించిన ఎమ్మెల్యే జీఎంఆర్ ను కాలనీ వాసులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేవానందం, జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, సర్పంచ్ నితీశా శ్రీకాంత్, వైస్ ఎంపీపీ సునీత సత్యనారాయణ, ఉప సర్పంచ్ జానకి జ్ఞానేశ్వర్, భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం కమిటీ చైర్మన్ తులసి రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement