Thursday, April 25, 2024

Alert: వెల్దుర్తి-మెదక్ రహదారిలో బ్రిడ్జిపై నుంచి పారుతున్న వ‌ర‌ద..

వెల్దుర్తి : శుక్రవారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి వెల్దుర్తి మండలంలోని ఉప్పు లింగాపూర్ గ్రామ సమీపంలో ఉన్న హల్దివాగు బ్రిడ్జి పై నుండి నీళ్లు పొంగిపొర్ల‌డంతో వెల్దుర్తి నుండి మెదక్ వెళ్లే దారి పూర్తిగా స్తంభించిపోయింది. ఉదయాన్నే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు మెదక్ వెళ్లలేక మెదక్ నుండి వెల్దుర్తికి వచ్చే వాళ్ళు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. బ్రిడ్జి పైనుండి నీటి ప్రవాహం ఎక్కువ రావడంతో వెల్దుర్తి ఎస్సై మధుసూదన్ గౌడ్ బ్రిడ్జి వద్దకు చేరుకుని బ్రిడ్జికి ఇరువైపులా భారీ కేట్లను ఏర్పాటు చేశారు. బ్రిడ్జి వద్దకు చేరుకున్న ప్రజలకు బ్రిడ్జి దాటడానికి ఎవరు ప్రయత్నించవద్దని వాగు ఉధృతి ఎక్కువున్న సందర్భంగా మోటార్ సైకిల్ కార్లు కొట్టుకుపోతాయని ప్రాణాలు పోయే అవకాశం ఉన్నందున ప్రజలు ఎవరు బ్రిడ్జి దాటే ప్రయత్నం చేయకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement