Wednesday, April 17, 2024

జోగిని శ్యామ‌ల‌పై జీరో ఎఫ్ ఐ ఆర్ న‌మోదు..

మెద‌క్ – జోగిని శ్యామలపై జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ నెల 12న మెదక్ జిల్లా ఏడుపాయల జాతరలో జోగిని శ్యామల తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని సికింద్రాబాద్ కు చెందిన స్రవంతి అనే మహిళ పంజాగుట్ట పీఎస్ లో ఫిర్యాదు చేసింది. బట్టలు విప్పి, ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేశారని ఫిర్యాదులో తెలిపింది. దీంతో జిరో ఎఫ్ ఐ ఆర్ గా ఫిర్యాదును పంజాగుట్ట పోలీసులు న‌మోదు చేశారు. అనంత‌రం విచార‌ణ కోసం కేసును మెదక్ జిల్లా పాపన్నపేట పీఎస్ కు బదిలీ చేశారు పంజాగుట్ట పోలీసులు. కేసు నమోదుపై శ్యామ‌ల స్పందిస్తూ, స్ర‌వంతే త‌న‌పై దాడి చేసింద‌ని ఆరోపించారు.. జాతరలో తాగి వచ్చి తనపై దాడి చేసి, తిరిగి త‌న‌పై కేసు పెట్టి తన పరువు తీయడానికి ఇవన్నీ చేస్తున్నారని పేర్కొంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement