Thursday, April 25, 2024

త‌డిసిన ధాన్యాన్ని ప్ర‌భుత్వం కొనుగోలు చేయాల‌ని రైతుల ధ‌ర్నా

వెల్దుర్తి : ఐకెపి సెంటర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినప్పటికీ కొనుగోలు ఆలస్యం చేయడంతో మొన్న కురిసిన అకాల వర్షానికి వడ్లు పూర్తిగా తడిసిపోయి మొలకలు తేలడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన ఒడ్లు మొలకలు రావడంతో అన్నదాత ఆందోళన చేపట్టాడు. వెల్దుర్తి మండల కేంద్రంలోని ఐకెపి సెంటర్ వద్ద వెల్దుర్తి నుండి మెదక్ కు వెళ్లే రోడ్డుపై రైతులు బైఠాయించి ధర్నాకు దిగారు. ప్రభుత్వం వెంటనే తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని.. లేనిపక్షంలో రైతుల ఆధ్వర్యంలో రోడ్లపై ధర్నాలు నిర్వహిస్తామని వారు డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement