Saturday, April 20, 2024

‘కంటి వెలుగు’ను స‌ద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

దుబ్బాక: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. సోమవారం అక్బర్ పేట భూంపల్లి మండలం చిన్న నిజాంపేట కంటి వెలుగు కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. కంటి పరీక్షలు ఎలా జరుగుతున్నాయని అధికారులను, ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
ప్రజలను ఆప్యాయంగా పలకరించిన కలెక్టర్…
అవ్వ అద్దాలు ఇచ్చారా నీకు కళ్ళు సరిగా కనిపిస్తున్నాయ అని అడిగి తెలుసుకున్నారు. అలాగే మీకు పింఛ‌న్ సరిగా వస్తుందా అని ఆప్యాయంగా అడిగారు.. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి కాశినాథ్, సర్పంచ్ రచన, పిఎసిఎస్ చైర్మన్ కైలాసం , ఎంపీడీవో భాస్కర శర్మ,మెడికల్ ఆఫీసర్ తేజస్విని, ఎంపీ ఓ నరేందర్ రెడ్డి, తాసిల్దారు వీరేష్, గ్రామ కార్యదర్శి , తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement