Thursday, April 25, 2024

ప్రతి పల్లె ప్రగతి బాటలో : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు : ప్రభుత్వం అందించే నిధులతో పాటు పరిశ్రమల సామాజిక బాధ్యత నిధుల ద్వారా పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకొని వెళుతున్నామని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్ చెరు మండలం పోచారం గ్రామంలో కోటి 50 లక్షల రూపాయల వ్యయంతో వ్యవసాయ పొలాలకు ఫార్మేషన్ రోడ్డు, 25 లక్షల రూపాయలతో అంబేద్కర్ భవన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం 20 లక్షల రూపాయలతో నిర్మించిన అంగన్వాడి భవనాన్ని ప్రారంభించారు. మొత్తం కోటి 95 లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులతో వీటిని చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ… గత ప్రభుత్వాల హ‌యాంలో గ్రామీణ ప్రాంతాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంత‌రం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రణాళికాబద్ధంగా వేల కోట్ల రూపాయల‌ నిధులు కేటాయిస్తూ ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాల అమలులో సైతం ముందంజలో ఉన్నామన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, గ్రామ సర్పంచ్ జగన్, ఉప సర్పంచ్ రాజు, ఎంపీటీసీ మమతా బిక్షపతి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, తలారి బిక్షపతి, గ్రామ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement