Wednesday, April 17, 2024

BIG BREAKING : సంగారెడ్డిలో ఇంజనీర్ ఆత్మహత్య

సంగారెడ్డి జిల్లాలోని పోతిరెడ్డిపల్లిలో గల ఓ లాడ్జ్ నుంచి కిందకు దూకి మేఘ కపూర్(22) అనే ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. గత నెలలో ఐఐటీ హైదరాబాద్‌లో కపూర్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. నెల రోజులుగా లాడ్జ్‌లోనే ఉన్న కపూర్… ఈరోజు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి స్వస్థలం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరాతీస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement