Sunday, March 24, 2024

సిద్ధిపేటలో పేలిన ఎలక్ట్రిక్ బైక్

వరుసగా ఎక్కడో ఒకచోట ఎలక్ట్రిక్ బైక్ పేలుళ్ల ఘటన చోటుచేసుకుంటున్నాయి. దీంతో బైక్ ల యజమానులు భయాందోళనలకు గురవుతున్నారు. అయితే తాజాగా… సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చీకోడు గ్రామంలో ఎలక్ట్రిక్ బైక్ దగ్ధమైంది. చార్జింగ్ పెట్టి పడుకున్న తర్వాత అర్ధరాత్రి సమయంలో బైక్ పేలింది. ఇంటికి నిప్పంటుకుని భారీగా మంటలు వ్యాపించాయి. దుబ్బాక నుంచి ఫైరింజన్ ను రప్పించి మంటలు ఆర్పివేశారు. చార్జింగ్ బైక్ యజమాని పుట్ట లక్ష్మీనారాయణ తన ఇంటి ఎదురుగా ఉన్న బొందనగారి దుర్గయ్య ఇల్లు ఖాళీగా ఉండటంతో ఆ ఇంటి బయటి ప్రాంతాన్ని తన అవసరాలకు వాడుకుంటున్నాడు. చార్జింగ్ స్కూటీకి పార్కింగ్ కోసం వాడుకుంటున్నాడు. యధావిధిగా మంగళవారం రాత్రి పార్కింగ్ చేసి, ఛార్జింగ్ పెట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement