Saturday, April 20, 2024

సంగారెడ్డి జిల్లాలో భూకంపం… తీవ్ర‌త 3.6గా న‌మోదు

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో భూకంపం వ‌చ్చింది. మంగళవారం వేకువ జామున 3.20 గంటల సమయంలో రిక్కర్‌ స్కేల్‌పై 3.6 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ తెలిపింది. జిల్లాలోని కోహీర్‌ మండలం బిలాల్‌పూర్‌లో ప్రకంపనలు రాగా.. ఒక్కసారిగా జనం ఉలిక్కిపడ్డారు. భయాందోళనకు గురై ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. అయితే ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నల్గొండకు 117 కిలోమీటర్ల దూరంలో, భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం గుర్తించినట్లు పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement